Thursday, April 29, 2010

రెడ్‌క్రాస్‌ మెడిసిన్‌ బ్యాంకు శ్రీకాకుళం లో , Redcross Medicine Bank in Srikakulam




జ్వరం, జలుబు, దగ్గు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, కిడ్నీ తదితర వాటితో బాధపడే వారికి అవసరమైన మందుల విషయంలో నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న మెడిసిన్‌ బ్యాంకు. శ్రీకాకుళం పట్టణంలో 2006 నవంబరు 9న ప్రారంభించారు. ఇప్పటివరకు మెడిసిన్‌ బ్యాంకు ద్వారా 7,062 మందికి అల్లోపతి (ఇంగ్లీషు), హోమియో మందులు పంపిణీ చేశారు. శనివారం (01 మే 2010)ప్రత్యేకంగా స్త్రీ సంబంధమైన వ్యాధుల కోసం సేవలు అందిస్తారు. నిరుపేదలు ఈ బ్యాంకుకు వెళ్లి తమ తమ వ్యాధులు వివరిస్తే చాలు,, అక్కడి వైద్యులు అవసరమైన పరీక్షలు చేయించి నివారణకు ఉపయోగపడే మందులు ఉచితంగా అందజేస్తారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సేవలు పొందుతున్నారు. అవసరాన్ని బట్టి అల్లోపతి, హోమియోపతి మందులు అందజేస్తారు. ఈ బ్యాంకులో పలువురు వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుండటం అభినందనీయం.

మందుల సేకరణ

మెడిసిన్‌ బ్యాంకుకు పలువురు వైద్యులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, తదితరులు తమ వంతు సాయంగా వివిధ వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు అందజేస్తుంటారు. వీటిని అవసరమయ్యే రోగులకు పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి కొచ్చే వారిలో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, నిస్సత్తువ, తదితర రోగాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.


వివిధ వ్యాధులకు సంబంధించి మందులు వాడుతున్న వారు కొన్ని సందర్భాల్లో ఆ కోర్సు ఆపేసి కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మందులు పనికిరానివిగా భావించి బయట పారేస్తుంటాము. ఇలా చేయకుండా వాటిని రెడ్‌క్రాస్‌కు అందజేస్తే వైద్యులు అవి ఏ వ్యాధికి పనికొస్తాయి, ఎప్పటివరకు వాటి వాడకం తేదీ ఉందో క్షుణ్ణంగా పరిశీలించి ఆయా మందులను ఒకచోట జాగ్రత్తచేస్తారు.

తోడ్పడండి: జగన్మోహనరావు(అధ్యక్షులు రెడ్ క్రాస్ -శ్రీకాకుళం )

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వినియోగించగా మిగిలిపోయిన మందులను పారేయకుండా పొట్టిశ్రీరాములు కూడలిలో గల జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయానికి, బాపూజీ కళామందిర్‌ వద్ద ఉన్న రెడ్‌క్రాస్‌ రక్తనిధికి అందజేయాలని అధ్యక్షులు పి.జగన్మోహనరావు కోరారు. ఇప్పటివరకు 7,062 మందికి మందులు అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలైన వారికి ఆరోగ్యకార్డులు అందజేస్తామని చెప్పారు. పట్టణ పరిధిలో 400 మందికి ఇప్పటికే వీటిని ఇచ్చినట్లు వెల్లడించారు. మెడిసిన్‌ బ్యాంకుకు విరాళంగా మందులు ఇవ్వదలచుకున్నవారు 9440195900 సెల్‌కు ఫోన్‌చేసి సంప్రదించాలని కోరారు.



  • =================================================
Visit My Website - > Dr.Seshagirirao-MBBS

Sunday, April 25, 2010

సెల్ ఫోన్ మెసేజ్లు వల్ల వచ్చే అనారోగ్యము , celphone SMS health hezard - Infomania





ప్రతి ఒక్కరి దగ్గర సుమారుగా ఒక సెల్ ఫొన్ ఉండడం సర్వ సాధారణమయిపోయినది . యువత అయితే -ఎస్ .ఎం.ఎస్ - లు అదేపనిగా చేస్తూఉంటారు . ఫొను అనేది ముఖ్యమైన సమాచారము పంపించేందుకు వినియోగించాలి కాని అతిగా వాడకూడదు . దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి .

శ్రీకాకులం జిల్లాలో దాదాపు 7 లక్షల మంది సెల్ ఫోన్ వినియోగదారులు ఉండగా అందులో అధిక శాతం వినియోగదారులు కుర్రకారులే . వీరంతా సెల్ ఫొన్లు అవసరానికి మించి వినియోగిస్తుండడం , రోజంతా అదేపనిగా ఎస్.ఎం.ఎస్. లు పంపిస్తూ కాలం గడుపూ ఉండడంతో " ఇన్ఫోమేనియా" వ్యాధి బారిన తెలియకుండానే పడుతున్నారు . అలాగే గత కొన్నేళ్ళుగా జిల్లాలో ఇంటర్నెట్ వినియోగం కుడా బాగా పెరిగింది .ఈంతో వారు కూడా ఈ-మెయిల్ లు అదే పనిగా చేస్తూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు .. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఇన్ఫోమేనియా వల్ల అనేక అనర్దాలు ఉన్నాయి .

సాధారణం గా యువతరం సెల్ఫోన్లలో మాట్లాడడం కంటే సంక్షిప్త సందేశాల ద్వారా చాటింగ్ చేసుకోవడానికే అధిక పాధాన్యత ఇస్తున్నారు . ఈ బ్లహీనతను ఆసరాగా వివిద సెల్ఫోన్ల కంపెనీలు ఎస్.ఎం.ఎం పాకేజీలను అందిస్తున్నాయి . మరికొన్ని సంస్థలు అయితే ఏకంగా నెలకు వేలల్లో ఉచిత ఎస్.ఎం.ఎస్ ల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి . దీంతో యువత అంతా బిజీ బిజీ గా ఉంటున్నారు .

అనర్ధాలు :
  • జ్ఞాపక శక్తి పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది . ధూమ పానం చేసేవారు , మత్తుపదార్ధాలుకు బానిస అయినవారి కంటే ఈ ఇంఫోమేనియా లొ పర్తిభా శక్తి తగ్గుతుంది .
  • ప్రధానం గా నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తి ఆరోగ్యం పై తీవ్రప్రభావము చూపుతుంది .
  • ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది . ఫలితంగా చదువుపై శ్రద్ద పెట్టలేని పరిస్థితి యేర్పడుతుంది .
  • అనవస ఆందోళన , చిరాకు , తలనొప్పీ వంటివి తరచుగా కనిపిస్తూ ఉంటాయి .
  • రొమాంటిక్ ఎస్.ఎం.ఎస్. లు వలన ప్రేమ వ్యవహారాలు , లౌవ్ ఫైల్యూర్లు వలన కొన్ని జీవితాలులో కలకలం రేగుతుంది . హత్య ... ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువవుతాయి .
  • చాలామంది పంపిన ఎస్.ఎం.ఎస్ లకు సమాదానాలు రావడం ఆలస్యమైనా . రాకపోయినా డిప్రషన్ కు లోనై కస్టాలలో పడతారు .
  • విలువైన కాలాన్ని వృదా అవడం వల్లా ... , అన్నారోగ్య పాలై ... చదువుపై శ్రద్ధ తక్కువై తమ కెరీర్ నే పాడుచేసుకుంటున్నారు .

  • =============================================
Visit My Website - > dr.seshagirirao-MBBS

Blood banks in Srikakulam , రక్త నిధి శ్రీకాకుళం లో





  • మనుషుల నుండి రక్తాన్ని సేకరించి .. గ్రూఫుల ప్రకారము లేబుల్స్ రాసి ఎయిడ్స్ , పచ్చకామెర్ల , వి.డి.అర్.యల్, మొదలగు అంటువ్యాధులు కోసం పరీక్షలన్నింటినీ సంభందిత నిపుణులైన టెక్నీసియన్ల చే తనికీ చేయించి , నిలువచేసే ప్రదేశం నే రక్త నిధి లేక బ్లడ్ బ్యాంక్ అంటాము . అవసరాన్ని బట్టి రక్తాన్నీ ఉచితంగా గాని , కొంత డబ్బు తీసుకొని గాని సరఫరా చేయుదురు .
  • శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందినప్పటికీ కృత్రిమ రక్తాన్ని తయారు చేసేవీలు లేక అనసరమైన మేరకు రక్తాన్ని దానం ద్వారా మాత్రమే సేకరించే వీలు వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఎనిమది లక్షల యూనిట్‌ల రక్తం అవసరం కాగా అందులో 6లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే 208 బ్లడ్‌బ్యాంక్‌ల ద్వారా సేకరించగలుగుతున్నారు.
రక్తం ఎక్కించవలసిన కొన్ని సాదారణ పరిస్థితులు :
  • రోడ్ ప్రమాదాలలో గాయాలైన వారికి ,
  • ఆపరేషన్ సమయం లో శరీర లో రక్తం తగినంత లేనపుడు .
  • రక్తహీనన ఉన్న రోజులకు ,
  • కొన్ని రక్త సంభందిత కాన్క్ష్సర్ రోగులకు ,
  • గర్భిణీ స్త్రీలకు కా్నుపు సమయం లోనూ, రక్తత స్రావము జరిగినపుడు ,

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిధి నిల్వ కేంద్రాలు -ఫోన్‌ నంబర్లు :

  • శ్రీకాకుళం జిల్లాలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఉంది. రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఒక రక్తనిధి ఉంది. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో పాలకొండ ఏరియా ఆసుపత్రి, పాతపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో రక్తనిధి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటి ఫోన్‌ నంబర్లు :



  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి - శ్రీకాకుళం -- 08942 2226555
  • * రిమ్స్‌ రక్తనిధి - శ్రీకాకుళం --- 9000273960
  • * పాలకొండ ఏరియా ఆసుపత్రి - 08941 220130
  • * పాతపట్నం సామాజిక ఆసుపత్రి రక్తనిధి కేంద్రం - ఫోను: 99487 65449
  • * రెడ్‌క్రాస్‌ రక్తనిధి ఉపకేంద్రం - రణస్థలం - ఫోను: 94411 59726



శ్రీకాకుళం పరిస్థితి :

  • జనాభా : ----------------25 లక్షల పైనే ,
  • జాతీయ రహదారి విస్తీర్ణం --195 కి.మీ.
  • ఏటా ప్రమాదాల సంఖ్య ----1700 ,
  • ఏటా కావలసిన రక్తం ----35,000 యూనిట్స్ ,
  • రెడ్ క్రాస్ , రిమ్సు (RIMS) సేకరణ్ --15 వేల యూనిట్లు ,



  • జిల్లాలో సుమారు 300 వరకూ రికగ్నైజెడ్ నర్సింగ్ హోములు ఉన్నాయి . ప్రభుత్వ పెద్దాసుపతులు ఉన్నాయి . కొన్ని రిజిస్టర్ కాని నర్సింగ్ హొమ్లు సుమారు 50 వరకూ ఉన్నాయి . ఇన్ని హాస్పిటల్స్ కు కావలసిన రక్తం బల్డ్ బ్యాంక్ లలో దొరకదు .
  • పూర్వము ప్రతి ప్రైవేటు హాస్పిటల్ లోనూ , నర్సింగ్ హోం లోనూ తగు జాగ్రత్తలతో రక్తం సేకరించి అవసరమైనపుడు ఎక్కించేవారు . దబ్బులు ఎంత తీసుకుంటున్నారు అనేది కాదు ... అవసరానికి రక్తం లోకల్ గా దొరికేది . కాని ఎయిడ్స్ , హెపటైటిస్ జబ్బులు రావడం తో ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఎక్కువ అయినందున ... బ్లడ్ బ్యాంక్ నుండే రక్తం సరఫరా అవ్వాలని నిబందనలు ఉండడం తో రక్తం సరఫరా లొ సానుకూలత లేక కొరత యేర్పడినది . జిల్లాలొ ఒకేఒక "రెడ్ క్రాస్ " రక్త నిధి , రిమ్‌స్ హాస్పిటల్ లొ ఒక రక్తనిధి ఉన్నాయి . జిల్లా అంతటికీ సప్లై అవడం కస్టం . అందుకే దొంగతనం గా రక్తం ఎక్కించే కొన్ని నకిలీ బ్లడ్ బ్యాంక్ లు అక్కడక్కడ జిల్లాలో ఉన్నాయి . ఇటువంటివి 4 -5 వరకూ ఉన్నాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు .


రక్తము దాతల -- అర్హతలు -- జాగ్రత్తలు :
  • రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యము కలిగిఉండాలి ,
  • 18 నుండి 60 యేళ్ళ చధ్య స్త్రీ ,పురుషులు ఎవరైనా రక్తదానము చేయవచ్చును ,
  • రక్తదాత 45 కేజీ ల బ్రువు పబడి ఉండాలి .
  • సాదారణ స్థాయిలొ బి.పి , సుగరు ఉండాలి ,
  • మూడు నెలల వ్యవధి లో యేడాదికి నాలుగు సార్లు రక్తదానము చేయవచ్చు ,
  • రక్తదానము చేయడానికి 12 గంటలు ముందు , తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు ,
  • స్త్రీలు రుతుక్రమము లోను , గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
శరీరం లో చాలినంత రక్తం లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు . శరీరం లొ 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది . అంటే శారీకక బరువులో ఇది 8 శాతము . ఒక కిలో శరీరము బరువుకు 80 ఎం.ఎల్ . చొప్పున్న ఉంటుందన్నమాట . శరీరం లోని అవయవాలు సక్రమం గా పనిచేయడానికి సరిపడ రక్తం అవసరము .

  • రక్తం లో ఏమి ఉంటాయి :
  • 55 శాతము ప్లాస్మా ,
  • 45 శాతము సెల్స్ .... ఉంటాయి .
  • ప్లాస్మాలో 91% నీరే , 8% ఆర్గానిక్ మాలిక్యూల్స్ , 1% ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి .
  • సెల్స లో ఎర్రరక్తకణాలు (RBC),తెల్లరక్తకణాలు(WBC) , ప్లేట్ లెట్స్(platlets) ఉంటాయి .
  • ఒక లీటరు రక్తం లో --- ఎర్ర రక్తకణాలు =5-6 మిలియన్లు -ఆక్షిజన్ సరఫరా కు తోడ్పడతాయి ,
  • --------------------తెల్లరక్త కణాలు =4-11 మిలియన్లు ,--శరీరం లొ ఇంఫెక్షన్ పై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి .
  • -------------------ప్లేట్ లెట్స్ కణాలు=1.5 - 4 మిలియన్లు ఉంటాయి -- రక్తం గడ్డ కట్టడానికి సహకరిస్తాయి .
  • ఎర్రరక్త కణాలు తగ్గితే అనీమియా అంటారు . ఎర్ర కణాలు శరీరము లో ఆక్షిజన్ సరఫరాకు ఉపయోగ పడతాయి . ఐరన్ , ఫోలిక్ ఆసిడ్ , విటమిను బి12 , విటమిను సి , తగినంత పోటీన్లు లేకపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది .

రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో కణవిభజన కేంద్రం-- ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ఉపకారం --- 05/Sept/2011



  • జిల్లాలో విస్తారమైన జాతీయ రహదారి ఉంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోగులను కాపాడేందుకు ఏడాదికి 40వేల యూనిట్ల రక్తం అవసరం. స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌, రిమ్స్‌ ఆసుపత్రి, రక్తదాన శిబిరాల నుంచి 15 వేల యూనిట్లు మాత్రమే వస్తోంది. రక్త కణ విభజన కేంద్రం ప్రారంభమైతే ఒక యూనిట్‌ రక్తం నలుగురికి ఉపయోగపడుతుంది.


జిల్లాలో రక్త కణ విభజన (బ్లడ్‌ కాంపోనెన్ట్స్‌) కేంద్రం లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల డెంగీ జ్వరాలతో బాధపడుతున్న వారు అవసరమైన రక్తఫలికలు లభించకపోవడంతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఏడాది కిందట రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో కణ విభజన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం లభించినప్పటికీ దస్త్రం దశలో నిలిచిపోయింది. రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు జిల్లాలో దీని అవసరాన్ని వివరిస్తూ పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యవస్థ ప్రారంభించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు రావడంతో.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్‌క్రాస్‌ రక్తనిధిపై భాగంలో రక్తకణ విభజనకు అవసరమయ్యే భవనాన్ని పూర్తి చేశారు. కణవిభజనకు అవసరమయ్యే వైద్య పరికరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ అందజేసేందుకు ముందుకు వచ్చింది. తదనంతరం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) జనరల్‌ఆసుపత్రిలో కూడా రక్త కణవిభజన కేంద్రం ఏర్పాటుకు అసవరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి అవసరమయ్యే పరికరాలు అమర్చినప్పటికీ కేవలం రక్తనిధికి రెన్యువల్‌ చేయలేదన్న సాకుతో నిలిచిపోయింది. ఆ పరికరాలు వృథాగా పడి ఉన్నాయి.


  • ఒక యూనిట్‌తో నలుగురికి మేలు-ఇప్పటి వరకు ఒక యూనిట్‌ రక్తంఒక్కరికే ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో రోగికి కావాల్సిన కణాలు తప్పా మిగతావన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. రక్తకణ విభజన కేంద్రం అందుబాటులోకి వస్తే ఒక యూనిట్‌ రక్తంతో నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తంలో ఎర్ర రక్తకణాలు(Red blood cells), తెల్లరక్తకణాలు(WBC), రక్తఫలికలు(platelets), ప్లాస్మా ఉంటుంది(plasma). అందరికీ ఇవన్నీ అవసరం ఉండవు. రక్తకణవిభజన వల్ల రోగి అవసరాలకు అనుగుణంగా కణాలను వినియోగించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు.


కణవిభజన..

  • * గుండెనొప్పితో బాధ పడేవారికి ఎర్రరక్తకణాలు అవసరం.
  • * వ్యాధినిరోధకశక్తితో బాధ పడేవారికి తెల్లరక్తకణాలు అవసరం.
  • * పౌష్టికారలోపం ఉన్నవారికి ప్లాస్మా అవసరం.
  • * డెంగీ, తదితర జ్వరాలతో బాధ పడేవారికి రక్తఫలికలు అవసరం.
  • * ఇవన్నీ ఒక యూనిట్‌ రక్తం ఉండడం వల్ల దేనికది విభజించి ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువస్తే ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందిని రక్షించే అవకాశం ఉంది.


జిల్లా కేంద్రంలోని రక్తనిధిలో రక్తకణ విభజన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భవన నిర్మాణం పూర్తి అయ్యింది. సంబంధిత వైద్య పరికరాలు రాగానే ప్రభుత్వ ఆమోదంతో కలెక్టర్‌ మార్గనిర్దేశంతో దీన్ని ప్రారంభిస్తాం.----- జగన్మోహనరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు

  • update on 04/Jan/2013

ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయండి-యువతకు జిల్లా కలెక్టరు పిలుపు :
 యువత అంతా కనీసం ఏడాదికోసారైనా రక్తదానం చేసి సమాజ సేవలో పాలు పంచుకోవాలని జిల్లా కలెక్టరు సౌరభ్‌గౌర్‌ పిలుపు ఇచ్చారు. మండల పరిధిలోని చల్లవానిపేట వంశధార డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం ఆయన రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా యువకులు చైతన్యవంతులని, వీరంతా గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన తీసుకురావాలని కోరారు. రక్తదానంతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానంద సూక్తి స్ఫూర్తితో యువత మానవసేవ చేయాలని సూచించారు. విద్యార్థినులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. శిబిరంలో మొత్తం 70 మంది పాల్గొన్నారు. ప్రిన్సిపల్‌ లోకనాథం రక్తదానం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, సభ్యులు నిక్కు అప్పన్న, కమిటీసభ్యులు నిక్కు హరి సత్యనారాయణ, జాతీయ యువజన గ్రహీత చైతన్యకుమార్‌, తహశిల్దారు ఎం.కాళీప్రసాద్‌, సెట్‌శ్రీ మేనేజరు మురగయ్య, వంశధార డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ మధుబాబు, గీతాశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 45వేల యూనిట్ల రక్తం అవసరం--రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు
 జిల్లాలో 45 వేల యూనిట్‌ల రక్తం అవసరంకాగా, ప్రస్తుతం రక్తదాన శిబిరాలతో కేవలం 10 వేల యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నామని రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ జగన్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో గురువారం జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రసవాల సమయాల్లో అవసరమైన రక్తం లేక ఎక్కువ మంది గర్భిణీలు చనిపోతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో ఈ తరహా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఉన్నాయని అన్నారు. ప్రసవ సమయంలో కనీసం 700 మి.లీ. రక్తం పోతుందని, ఒకరి నుంచి 300 మి.లీ రక్తం సేకరిస్తున్న నేపథ్యంలో ఇద్దరు రక్తదానం చేస్తే ఒక గర్భిణికి సరిపోతుందన్నారు. జిల్లా కేంద్రంలో రెండు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని, వీటితో పాటు పాలకొండలో ఒక కేంద్రం ఉందని వివరించారు. ఇప్పటి వరకు 152 శిబిరాలు నిర్వహించి 7వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నేత్ర సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేశామని, జిల్లాలో 167 మంది నేత్రదానం చేయడంతో 306 మందికి కంటి చూపు దక్కిందని చెప్పారు. నేత్రదానంపై యువత గ్రామీణుల్లో అవగాహన పెంచాలని కోరారు.

--చల్లవానిపేట(జలుమూరు),న్యూస్‌టుడే
  • ===========================
visit my website - > Dr.seshagiriao-MBBS

Saturday, April 24, 2010

ఉద్దానములో కిడ్నీ వ్యాదులు , Kidney diseases in Uddanam of Srikakulam dist






మూత్రపిండాల వ్యాధులు ఉద్దాన ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. గతంలో 25 శాతం వ్యాధిగ్రస్థులున్నట్లు తేల్చగా తాజా సర్వే ప్రకారం 40 నుంచి 50 శాతం వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఒక పక్క సర్వేలు, సమీక్షల పేరిట కాలం గడుపుతుండగా ఎటువంటి వైద్య సహాయం అందక రోగులు మరణిస్తున్నారు. అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల బృందం ఇటీవలే సర్వే నిర్వహించింది. నీటి నమూనాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో క్రిమి సంహారక మందుల వినియోగం అధికంగా ఉండటం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

పరిస్థితి

* గుణుపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు చొక్కర దేవరాజు వివాహానికి సిద్ధమయ్యారు. ఇటీవల పెళ్లిచూపులు జరిగాయి. దురదృష్టవశాత్తు మూత్రపిండాల వ్యాధితో మృతిచెందాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. వారిని పెంచి పోషిస్తాడనుకున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు మాకమ్మ, అప్పన్నలకు వేదనే మిగిలింది.

* కొండపల్లికి చెందిన ఎంపల్లి మోహన్‌రావు (35) కిడ్నీ వ్యాధితో నాలుగు రోజుల కిందట మృతిచెందాడు. మెట్టూరుకు చెందిన దాసిర డిల్లమ్మ ఇదే వ్యాధితో ఇటీవల మృతిచెందారు. బైపల్లికి చెందిన 18 ఏళ్ల యువకుడు చీకటి ప్రసాద్‌ అయిదు నెలల కిందట మృత్యుపాలయ్యాడు.

* అక్కుపల్లికి చెందిన లండ వెంకటమ్మ (55)కు కాళ్ల పొంగులు రావడంతో విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకోగా కిడ్నీ వ్యాధి ఉందని నిర్ధరించారు. నాలుగు నెలలకే వ్యాధి తీవ్రతతో ఆమె మంచం పట్టి మృత్యువుతో పోరాడుతోంది. యు.ఆర్‌.కె.పురం, గుణుపల్లి, మెట్టూరు, గడూరు, అక్కుపల్లి, సైనూరు, తదితర గ్రామాలకు చెందిన వారు ఏటా పదుల సంఖ్యలో తనువు చాలిస్తున్నారు.


ఏటా సర్వేల పేరిట ప్రత్యేక వైద్య బృందాలు వచ్చి వెళ్తున్నాయి తప్ప ఫలితాలు లేవంటూ ఉద్దానం, తీర ప్రాంతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికీ ఆరుసార్లు చేపట్టిన సర్వేలు ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రక్త, నీటి నమూనాలు సేకరించి వెళ్లినా వ్యాధికి గల కారణాలు గుర్తించలేకపోయారంటూ గుణుపల్లికి చెందిన తిర్రి లక్ష్మినారాయణ, కె.నిరంజన్‌, జి.ఆనంద్‌, టి.భాస్కరరావులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల అమెరికాకు చెందిన వైద్య బృందం మెట్టూరు వచ్చి వెళ్లారు.

డయాలసిస్‌ కేంద్రాలు

కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్‌ చేసుకునేందుకు రూ.వేలు అప్పులు చేస్తూ విశాఖపట్నం కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వీరికి అవసరమైన డయాలిసిస్‌ యూనిట్లను శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య గతంలో ప్రకటించారు. నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

బాధితులకు అందని సాయం
ఉద్దానంలో మృత్యుఘంటికలు మోగుతునే ఉన్నాయి. 2000లో మూత్రపిండాల వ్యాధి లక్షణాలు కొన్ని గ్రామాల్లో కనిపించే సరికి సాధారణ విషయంగానే వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కొట్టి పారేశారు. ఆ తర్వాత తీవ్రతను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని పేర్కొన్నా వాస్తవానికి మృతుల సంఖ్య వేలల్లో ఉంది. కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సోంపేట, మందస, పలాస మండలాల పరిధిలో మృతుల సంఖ్య పదివేలకు పైబడి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటి విశాఖ కె.జి.హెచ్‌. సూపరింటెండెంట్‌ రవిరాజు నేతృత్వంలో అధికారుల బృందం 2006లో కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని వ్యాధి ఉద్ధృతి అధికంగా ఉన్న గ్రామాల్లో పర్యటించింది. రోగులతో పాటు ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించింది. తాగునీరు, ఆహార అలవాట్లు, వంశపారంపర్య వ్యాధుల గురించి వివరాలు తీసుకొని అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అక్కడి నిపుణులతో కలిపి అధ్యయనం చేయించింది. అదే సమయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, అమెరికాలోని స్టోనీబ్రూక్‌ విశ్వవిద్యాలయాలు వ్యాధి ఉద్ధృతిపై అధ్యయనం చేశాయి.

క్రిమి సంహారక మందుల ప్రభావం

తాజా విశ్లేషణల ప్రకారం తాగునీటిలో సమస్యలు పెద్దగా లేవని, క్రిమి సంహారక మందుల వినియోగం ఎక్కువగా ఉండటం మూలంగానే వ్యాధులు ఎక్కువైనట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే దీన్ని వారు ధ్రువీకరించడంలేదు. విశాఖపట్నంలో డయాలసిస్‌ కేంద్రాలున్నా స్థానికులకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. విశాఖపట్నానికి రానుపోను దూరం 200 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అందని సాయం
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు వైద్యం పొందాలంటే నెలకు నగదు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుంది. వైద్య పరీక్షలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణ, పౌష్ఠికాహారానికి నెలకు కనీసం రూ.3 వేలకు వరకు ఖర్చు అవుతుంది. ప్రారంభదశలో వ్యాధిని గుర్తిస్తే క్రమం తప్పకుండా మందులు వాడితే మరికొంత కాలం జీవించే అవకాశముంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని భరించే స్థితిలో లేరు. ఈ ప్రాంతంలో అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రత్యేక చర్యలు
ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా చర్యలు ప్రారంభించనుంది. వ్యాధికి గల కారణాలపై ఇప్పటికే వైద్య బృందాలు ఉద్దానంలో సర్వే ప్రారంభించింది.

మూలము = విజయసారథి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, శ్రీకాకుళం.

రిమ్స్ లో డయాలిసిస్ కేంద్రము (Dialysis in Srikakulam )

దివంగత ముఖ్యమంత్రి డా. రాజసేఖర రెడ్డి పుణ్యమా అని. . శ్రీకాకుళంలో RIMS medical college పెట్టడం జరిగినది . అన్ని వైద్యసదుపాలల్తో పాటు డయాలిసిస్ కూడా నెలకొల్పడం దానిమూలంగా సుమారు సమ్వత్సరానికి వందలాది మూత్రపిండాల వ్యాదిగ్రస్తులు ముఖ్యము గా ఉద్దానము ప్రాంతం వారు లబ్దిపొందుతున్నారు .
ఎలా సంప్రదించాలి :
కిడ్నీ రోగులు రిమ్‌స్ లో ఒ.పి. విభాగము లో పేరు నమోదు చేయించుకుంటే మడికల్ వార్డ్కు పంపిస్తారు . అక్కడ " క్రియాటినిన్‌ , బ్లడ్ యూరియా తదితర పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించి డయాలిసిస్ అవసరమా లేదా మందులతో తగ్గించవచ్చా? అనేది నిర్ణయిస్తారు . డయాలిసిస్ విభాగము చీప్ అధ్వర్యము లో అవసరమైనవారికి నిర్ధేశిత పట్తిక ప్రకారము చికిత్స ప్రారంభిస్తారు . ఈ క్రమములో రోగుల జీవన ప్రమాణము పెంచుతూ ఉంటారు . ఒక పేసెంటుకి అవసరాన్ని బట్టి నెలకు 08 సార్లు డయాలిసిస్ చేస్తారు .
మూత్ర పిండాలు ఎలా పనిచేస్తాయో అవగాహన :
మానవ శరీరములో వెన్నెముకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒక్కోక్కటి 10 నుండి 12 సెంటీమీటర్లు చుట్టుకొలత , 150 గ్రాముల బరువు ఉంటుంది. రోజుకి మొత్తం మీద 1.5 నుంచి 2.0 లీటర్ల వరకు మూత్రాన్ని తయారుచేస్తాయి . రక్తాన్ని వడపోసి యూరియా , క్రియాటినిన్‌ వంటి మలిన పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. శరీరములో నీటిశాతాన్ని , లవణ పరిమాణాన్ని క్రమబద్దీకరిస్తాయి.
చెడిపోవడానికి కారణాలు - అవగాహన :
మధిమేహము , రక్తపోటు , ఉబ్బుకామెర్ల , అధికమొత్తం లో నొప్పినివారణ మాత్రలు తినడము , మూత్రపిండాలలో రాళ్లు , పుట్టుకతో వచ్చే కిడ్నీ వ్యాధులు , మూత్రకోశ , మూత్రనాళ వ్యాధులు , ఎక్కువ వాంతులు , విరోచనాలు వల్ల కలిగే డిహైడ్రేషన్‌ , మలేరియా మున్నగునవి .
నివారణ చర్యల అవగాహన :
రక్తపోటు , మధుమేహ వ్యాధులు అదుపులో ఉంచుకోవడము ,
తీసుకునే ఆహారములో ఉప్పును క్రమబద్ధీకరించుకోవడం ,
రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం,
కుటుంబకులో ఎవర్కైనా కిడ్నీవ్యాదు ఉంటే మిగిలినవారు వైద్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ,
వ్యాధి లక్షణాలు - అవగాహంకోసం :
అధిక రక్తపోటు , నిష్షత్తువుగా ఉండడం , ఆకలి మందగించడం , వాంతులు , దురద , ఒళ్ళు నొప్పులు , శరీరంతా వాపు , మూత్రము ఎక్కువసార్లు రావడం , చిన్న పిల్లలలో ఎదుగుదల లేకపోవడం , మూత్రం లో మంట , మూత్రం ఎరుపురంగులో పడ్డం , మున్నగునవి .... ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి .

  • =========================================
Visit My Website - > dr.seshagirirao-MBBS